వలస కార్మికుడే హీరో

5 Jun, 2020 05:29 IST|Sakshi
దిలీప్‌రాజా

‘పండుగాడు ఫొటో స్టూడియో’ ఫేమ్‌ దర్శకుడు దిలీప్‌రాజా ‘లాక్‌డౌన్‌’ అనే టైటిల్‌తో ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. ‘లాక్‌డౌన్‌’ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌కు కేంద్ర సెన్సార్‌ బోర్డ్‌ ఆమోదం ఇచ్చినట్లుగా దిలీప్‌రాజా తెలిపారు. ఈ సినిమాను విజయ బోనెల, ప్రదీప్‌ దోనూపూడి నిర్మించనున్నారు. ఈ ‘లాక్‌డౌన్‌’ సినిమా గురించి దిలీజ్‌ రాజా మాట్లాడుతూ– ‘‘ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్‌ షెడ్యూల్‌లో ఈ  చిత్రాన్ని పూర్తి చేస్తాం. ఒకవైపు కరోనా వైరస్‌ నుంచి తమను తాము కాపాడుకుంటూ మరోవైపు గమ్యస్థానానికి బయలుదేరిన వలసకూలీల బతుకు చిత్రమే ‘లాక్‌డౌన్‌’. ఈ చిత్రంలో వలస కార్మికుడే హీరో. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరి ప్రాణాలను వారే కాపాడుకోవాలనే సన్నివేశాలు ఈ కథలో ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. అలాగే ‘యూత్‌: కుర్రాళ్ళ గుండె చప్పుడు’ అనే చిత్రాన్ని కూడా డైరెక్ట్‌ చేస్తున్నారు దిలీప్‌రాజా.

మరిన్ని వార్తలు