పిల్లలు కాదు... పిడుగులు

4 Aug, 2015 01:08 IST|Sakshi
పిల్లలు కాదు... పిడుగులు

నేటి బాలలే...రేపటి పౌరులు. ఈ అంశాన్నే నేపథ్యంగా తీసుకుని చేసిన చిత్రం ‘లిటిల్ స్టార్స్’. రిషి ప్రధాన పాత్రలో రషీద్ బాషా దర్శకత్వంలో ఎస్. ఇబ్రహీమ్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
 
  ‘‘మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ గారి స్ఫూర్తితో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఆరుగురు పిల్లలు పిడుగులై, అసాధ్యాన్ని సుసాధ్యం ఎలా చేశారన్నదే ఈ సినిమా ఇతివృత్తం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:కిషన్‌సాగర్, సంగీతం: శ్రీ వెంకట్.