చిరు సినిమాకు ముహుర్తం కుదిరిందోచ్!

26 Apr, 2016 07:11 IST|Sakshi
చిరు సినిమాకు ముహుర్తం కుదిరిందోచ్!

హైదరాబాద్: మెగా అభిమానులకో శుభవార్త.  ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి 150వ సినిమా కు ఎట్టకేలకు ముహుర్తం కుదిరింది. ఈనెల 29న మధ్యాహ్నం 1:30 లకు ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరగనుంది. ఆ తర్వాత మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఆ రోజు దేవుడి పటాలపై పూజతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ముహుర్తం షాట్కు కుటుంబ సభ్యులకు మాత్రమే ఎంట్రీ ఉన్నట్లు సినీవర్గాల సమాచారం. పవన్ స్టార్ పవన్ కల్యాణ్, రామ్చరణ్, అల్లు అర్జున్ తో పాటు కొద్దిమంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నట్టు తెలిసింది.

తన 150 వ చిత్రానికి మంచి కథ కోసం చూస్తున్న చిరుకి... తమిళంలో విజయ్ హీరోగా నటించిన 'కత్తి' సినిమా కథ నచ్చడం రీమేక్ రైట్స్ సొంతం చేసుకోవడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ చిత్రానికి దర్శకుడు ఎవరా అని చర్చలు జరిగి, పలుపేర్లు తెరమీదకు వచ్చినా, చివరకు ఆ అవకాశం వీవీ వినాయక్ కే దక్కింది. గతంలో చిరంజీవి, వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, చిరంజీవి 150వ చిత్రానికి తనయుడు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.