తెలంగాణ ప్రజలకు చిరు విషెస్‌

2 Jun, 2020 11:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ట్విటర్‌ వేదికగా రాజకీయ, సినీ ప్రముఖులు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ‘ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా, దశాబ్దాల కల సాకారం చేసిన జన హృదయ నేత శ్రీ కేసీఆర్‌ గారికి, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. అదేవిధంగా ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌కు చిరంజీవి బర్త్‌డే విషెస్‌ తెలిపారు. (తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ నివాళి)

మరిన్ని వార్తలు