ఛలో రాజమండ్రి

14 Dec, 2019 00:21 IST|Sakshi
చిరంజీవి

చిత్రబృందంతో కలసి రాజమండ్రిలో ల్యాండ్‌ అవడానికి స్కెచ్‌ గీస్తున్నారు కొరటాల శివ. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ ఈ నెల 26న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభిచాలనుకుంటున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటించనున్నారని సమాచారం. ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను రాజమండ్రిలో చిత్రీకరించాలనుకుంటున్నారట. అక్కడ లొకేషన్స్‌ వెతికే పనిలో ఉందట యూనిట్‌. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.

మరిన్ని వార్తలు