డబుల్‌ ట్రీట్‌?

12 Jul, 2019 00:16 IST|Sakshi
చిరంజీవి, ఐశ్వర్యారాయ్‌

కమ్‌బ్యాక్‌ చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’లో క్లాస్, మాస్‌ పాత్రల్లో డబుల్‌ యాక్షన్‌ చేశారు చిరంజీవి. ప్రేక్షకులకు అది డబుల్‌ ట్రీట్‌లా అనిపించింది. ఇప్పుడు మరోసారి చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నారని తెలిసింది. ‘సైరా’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి రెండు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఈ డ్యూయల్‌ రోల్‌ తండ్రీ కొడుకులా? అన్నదమ్ములా? అనేది తెలియాల్సి ఉంది. ఇందులో చిరంజీవికి జోడీగా ఐశ్వర్యారాయ్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. వచ్చే ఏడాది ఉగాదికి ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు