-
ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్లో 152వది. చిరంజీవి హీరోగా నటించే 153వ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే చర్చ జరుగుతోంది. దర్శకులు మెహర్ రమేష్, సుజిత్, కేఎస్ రవీంద్ర (బాబీ)లతో సినిమాలు చేయాలనుకుంటున్నానని చిరంజీవి ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు. మరి ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరి కథతో ఆయన 153వ చిత్రం సెట్స్పైకి వెళ్తుందంటే దర్శకుడు బాబీ చెప్పిన కథ అని తాజా సమాచారం. బాబీ స్టోరీ మొత్తం రెడీ చేసి, చిరంజీవికి వినిపించారట. కథ నచ్చి, చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.