-

నెక్ట్స్‌ ఫిక్స్‌?

23 Apr, 2020 02:42 IST|Sakshi

ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లో 152వది. చిరంజీవి హీరోగా నటించే 153వ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే చర్చ జరుగుతోంది. దర్శకులు మెహర్‌ రమేష్, సుజిత్, కేఎస్‌ రవీంద్ర (బాబీ)లతో సినిమాలు చేయాలనుకుంటున్నానని చిరంజీవి ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు. మరి ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరి కథతో ఆయన 153వ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందంటే దర్శకుడు బాబీ చెప్పిన కథ అని తాజా సమాచారం. బాబీ స్టోరీ మొత్తం రెడీ చేసి, చిరంజీవికి వినిపించారట. కథ నచ్చి, చిరంజీవి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారట.

మరిన్ని వార్తలు