సైరా ప్రమోషన్స్‌.. ముంబై వెళ్లిన చిరు

27 Sep, 2019 19:43 IST|Sakshi

తొలి స్వతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహారెడ్డి తెరకెక్కింది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని రామ్‌చరణ్‌ నిర్మించారు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన టీజర్‌, ట్రైలర్స్‌, సాంగ్‌తో సినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.

ఈ మూవీ ప్రమోషన్స్‌ పెంచే కార్యక్రమంలో భాగంగా.. చిరు ముంబైకి వెళ్లారు. ఈ క్రమంలో అమితాబ్‌, ఫర్హాన్‌ అక్తర్‌, చిరంజీవి కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో బిగ్‌ బీ అమితాబ్‌, కిచ్చా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రం  ఈ చిత్రం తెలుగు, తమిళ, మళయాల, కన్నడ హిందీ భాషల్లో అక్టోబర్‌ 2న విడుదల కానుంది.

మరిన్ని వార్తలు