నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్‌: జీ తెలుగు

22 Jun, 2020 10:50 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత లాక్‌డౌన్‌ పరిస్థితి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా తమ సీరియల్స్, ప్రోగ్రామ్స్‌ చిత్రీకరిస్తున్నట్లు ప్రముఖ వినోద చానెల్‌ జీ తెలుగు ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. గత కొంత కాలంగా నిలిచిపోయిన తమ  కార్యక్రమాల ప్రసారం సోమవారం నుంచి పునః ప్రారంభం అవుతుందన్నారు. ఈ పునః ప్రారంభ సంబరంలో రేణూదేశాయ్, ప్రియదర్శి తదితర సినీ రంగ ప్రముఖులు పాల్గొంటున్నారన్నారు. 

మరిన్ని వార్తలు