ఖైదీ ఫంక్షన్ ముగించండి.. ఐజీ ఆదేశం

7 Jan, 2017 20:29 IST|Sakshi
ఖైదీ ఫంక్షన్ ముగించండి.. ఐజీ ఆదేశం
ఖైదీ నెం.150 చిత్ర ప్రీలాంచ్ వేడుకను వీలైనంత త్వరగా ముగించాలని గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ సినిమాకు సంబంధించిన వర్గాలను ఆదేశించారు. హాయ్‌ల్యాండ్‌లో ఇప్పటికే పరిమితికి మించి జనం చేరుకున్నారని, తిరిగి వెళ్లే సమయంలో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉన్నందున వెంటనే ఫంక్షన్ ముంగించాలని ఐజీ సంజయ్ ఆదేశించినట్లు తెలిసింది. వేదికపైకి వెళ్లిన పోలీసు ఉన్నతాధికారులు.. అల్లు అరవింద్‌తో చర్చించారు. ఏ ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదని, అందువల్ల దయచేసి ఫంక్షన్ వెంటనే ముగించాలని చెప్పారు.