ప్రేమను పంచుదాం

23 Apr, 2020 02:22 IST|Sakshi

ప్రస్తుత పరిస్థితుల్లో అందరిలోనూ స్ఫూర్తిని పెంచి, ప్రేమను పంచాలనే ఉద్దేశంతో కమల్‌ హాసన్‌ కరోనా వైరస్‌ పోరాటంపై  ‘అరివుమ్‌ అన్బుమ్‌’ (బుద్ధి, ప్రేమ) పేరుతో  ఓ పాటను సిద్ధం చేశారు. జిబ్రాన్‌ సంగీతం అందించిన ఈ పాటను పాడటంతో పాటు  కమల్‌ హాసనే స్వయంగా రాశారు. ఈ పాటకు కమల్‌ తో పాటు సుమారు 12 మంది ప్రముఖులు గొంతు కలిపారట.

శంకర్‌ మహదేవన్, అనిరుధ్, జిబ్రాన్, యువన్‌ శంకర్‌ రాజా, దేవిశ్రీ ప్రసాద్, బొంబాయి జయశ్రీ, సిద్‌ శ్రీరామ్,  సిద్ధార్థ్, శ్రుతీ హాసన్, ఆండ్రియా, తమిళ బిగ్‌ బాస్‌ ఫేమ్‌ ముగెన్‌ ఈ పాటను ఆలపించారు. ఈ పాటను ఎవరింట్లో వాళ్లు ఉండి రికార్డ్‌ చేశారు. ‘‘ఈ పాటను కమల్‌ హాసన్‌ గారు కేవలం రెండు గంటల్లో రాసేశారు. పాటలో 12 మంది వాయిస్‌ మాత్రమే కాదు 37 మంది కోరస్‌ వాయిస్‌లు వినిపిస్తాయి. వాళ్లను ఆన్‌ లైన్‌ ఆడిషన్‌ చేసి సెలక్ట్‌ చేశాను’’ అని ఈ పాటకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు జిబ్రాన్‌. త్వరలోనే ఈ పాట విడుదల కానుంది.

మరిన్ని వార్తలు