దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమాలో అలియాభట్, డైసీ ఎడ్గర్ జోన్స్లు హీరోయిన్లుగా నటిస్తున్నట్టుగా ప్రకటించాడు జక్కన్న. అయితే ఈ సినిమా నుంచి డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.
Due to unavoidable circumstances, @DaisyEdgarJones is no longer a part of our film. We hope she has a brilliant future. #RRR
— RRR Movie (@RRRMovie) 5 April 2019
ఈ విషయంపై డైసీ కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. కుటుంబపరమైన కారణాల వల్ల తాను ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించలేకపోతున్నా అన్న డైసీ, ఆర్ఆర్ఆర్ అద్భుతమైన కథ, ఈ సినిమా తాను చేయాల్సిన పాత్రలో ఎవరూ నటించినా గొప్ప స్వాగతం లభిస్తుందని తెలిపారు.
ఎన్టీఆర్గా జోడిగా నటిస్తున్న హాలీవుడ్ నటి డైసీ.. ఆర్ఆర్ఆర్ నుంచి తప్పుకోవటంతో చిత్ర యూనిట్ మరో హాలీవుడ్ భామ కోసం ప్రయత్నాలు ప్రారంభించారట. ఇటీవల రామ్చరణ్కు గాయం కావటంతో పూణే షెడ్యూల్ ను అర్ధాంతరంగా క్యాన్సిల్ చేశాడు రాజమౌళి, మూడు వారాల తరువాత షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.