'ఇద్దరూ ఒకేరోజు చనిపోవడం బాధాకరం'

14 Dec, 2015 12:19 IST|Sakshi
'ఇద్దరూ ఒకేరోజు చనిపోవడం బాధాకరం'

సినీ రచయితలు సత్యమూర్తి, శ్రీనివాస చక్రవర్తి ఒకే రోజు మరణించడం బాధాకరమని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు విచారం వ్యక్తం చేశారు. సత్యమూర్తి, శ్రీనివాస చక్రవర్తి కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలియజేశారు.


ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌ తండ్రి, ప్రముఖ సినీ రచయిత గొర్తి సత్యమూర్తి (61) చెన్నైలోని తన నివాసంలో సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. మరో రచయిత శ్రీనివాస చక్రవర్తి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

>