తిరుమలలో బాలీవుడ్‌ జంట

14 Nov, 2019 09:51 IST|Sakshi

సాక్షి, తిరుమల: బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలసి గురువారం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. బుధవారం తిరుమల చేరుకున్న వీరు రాత్రి ఇక్కడే బస చేశారు. ఈ ఉదయం స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. తమ మొదటి పెళ్లిరోజు సందర్భంగా వారు తిరుమలకు వచ్చారు. రేపు అమృత్‌సర్‌లో స్వర్ణదేవాలయాన్ని దర్శించుకోనున్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తదితర ప్రముఖులు కూడా గురువారం తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

>
మరిన్ని వార్తలు