హిమాచల్‌ టు పుణే

30 Sep, 2018 06:26 IST|Sakshi
రకుల్‌ప్రీత్‌ సింగ్‌

వరదల కారణంగా హిమాచల్‌ ప్రదేశ్‌ మనాలిలో షూటింగ్‌ షెడ్యూల్‌ను ‘దేవ్‌’ మూవీ టీమ్‌ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. వరదల వల్ల చిత్రనిర్మాత లక్ష్మణ్‌కు దాదాపు కోటిన్నర నష్టం వాటిల్లిందట. కార్తీ హీరోగా రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ సినిమా ‘దేవ్‌’. ఇందులో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్నారు. సీనియర్‌ నటుడు కార్తీక్, రమ్యకృష్ణ కీలక పాత్రలు చేస్తున్నారు. హిమాచల్‌ షెడ్యూల్‌ని ఆపేసిన నేపథ్యంలో తదుపరి పుణేలో ప్లాన్‌ చేశారు. ఇప్పుడీ టీమ్‌ అక్కడే ఉంది. ఈ షూట్‌లో జాయిన్‌ అయ్యారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఈ షెడ్యూల్‌లో హీరో, హీరోయిన్ల పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడంతో పాటుగా ఓ సాంగ్‌ను కూడా షూట్‌ చేస్తారు. మనాలి షూటింగ్‌ క్యాన్సిల్‌ అవ్వడం వల్ల సినిమా షూటింగ్‌ ఆలస్యం అవ్వకూడదని అనుకున్న టైమ్‌లో కంప్లీట్‌ చేయాలని చిత్రబృందం రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తోందట.

మరిన్ని వార్తలు