అన్నింటికీ ధనమ్‌ మూలమ్‌

13 Apr, 2019 00:49 IST|Sakshi
మిస్తీ చక్రవర్తి

అధర్వ, మిస్తీ చక్రవర్తి జంటగా దర్శకుడు బద్రి వెంకటేశ్‌ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘సెమ్మ బోథ ఆగాదే’. ఈ చిత్రాన్ని ‘ధనమ్‌ మూలమ్‌’ టైటిల్‌తో నిర్మాత రాజశేఖర్‌ అన్నభీమోజు ఈ తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ‘కిక్కు ఎక్కిపోయెరా’ అనేది క్యాప్షన్‌.  ‘‘ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత రాజశేఖర్‌. ‘‘ఇదో క్రైమ్‌ థ్రిల్లర్‌. యువన్‌ శంకర్‌ రాజా మ్యూజిక్‌ హైలైట్‌గా నిలుస్తుంది. తమిళంలో లాగానే తెలుగులోనూ పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నాం’’ అన్నారు సహ నిర్మాత జె.వి. రామారావు. ఈ చిత్రానికి సమర్పణ: వీరబ్రహ్మాచారి అన్నభీమోజు, నిర్మాణం: గ్రేహాక్‌ మీడియా.

మరిన్ని వార్తలు