నటి అమలాపాల్‌కు మరో లక్కీఛాన్స్ దక్కింది.

30 Jul, 2013 06:17 IST|Sakshi
నటి అమలాపాల్‌కు మరో లక్కీఛాన్స్ దక్కింది.
నటి అమలాపాల్‌కు మరో లక్కీఛాన్స్ దక్కింది. ఆమె ధనుష్‌కు జంటగా త్వరలో ఓ చిత్రంలో నటించనున్నారు. విజయ్‌కు జంటగా నటించిన తలైవా చిత్రం ఆగస్ట్ తొలివారంలో విడుదల కానుంది. ప్రస్తుతం జయం రవితో నిమిర్దునిల్ చిత్రంలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో మరో అవకాశం లభించింది. ధనుష్ తన సొంత నిర్మాణ సంస్థ ఉండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించే చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు.
 
  ఈ బ్యానర్‌లో ఇంతకు ముందు తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో 3 చిత్రాన్ని నిర్మించి హీరోగా నటించారు. తర్వాత శివకార్తికేయన్ హీరోగా ఎదుర్ నీచల్ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు తానే హీరోగా నటించడానికి సిద్ధమయ్యారు. పొల్లాదవన్, ఆడుగళం చిత్రాలకు చాయాగ్రహణం అందించిన వేల్‌రాజ్ ఈ చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టనున్నారు. అమలాపాల్ హీరోయిన్. ఈ చిత్ర షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.