బర్త్‌డే స్పెషల్‌

17 Jun, 2018 01:38 IST|Sakshi
ధనుష్‌

‘పొల్లాదవన్, ఆడుకుళం’ వంటి బ్లాక్‌బాస్టర్‌ హిట్స్‌ తర్వాత దర్శకుడు వెట్రిమారన్, హీరో ధనుష్‌  మూడోసారి ‘వడ చెన్నై’ సినిమా కోసం కలిశారు. ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాపై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. రెండు పార్ట్స్‌గా రిలీజ్‌ కానున్న ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాలో ఆండ్రియా, ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్లుగా యాక్ట్‌ చేస్తున్నారు. వండర్‌బార్‌ ఫిల్మ్‌ బ్యానర్‌పై ధనుష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్‌ ఇవ్వనున్నారు ధనుష్‌. ఈ చిత్రం ఫస్ట్‌ పార్ట్‌ ట్రైలర్‌ని బర్త్‌డే స్పెషల్‌గా జూలై 28న  రిలీజ్‌ చేసి, సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్‌ చేస్తున్నట్టు చిత్రబృందం పేర్కొంది.

మరిన్ని వార్తలు