దిగ్భ్రాంతికి గురయ్యా!

23 Jun, 2014 22:46 IST|Sakshi
దిగ్భ్రాంతికి గురయ్యా!

పూరబ్ కోహ్లి
ముంబై: ‘ఝలక్ దిఖ్‌లా జా’ ఏడో సీజన్ నుంచి తప్పించడం తనను దిగ్భ్రాం తికి గురిచేసిందని బాలీవుడ్ నటుడు పూరబ్ కోహ్లి పేర్కొన్నాడు. తన ప్రదర్శనకు న్యాయమూర్తుల చక్కని స్పం దన వచ్చిందని, అయినప్పటికీ ఈవిధంగా జరుగుతుం దని తాను ఊహిం చలేద ని ఈ ‘రాక్ ఆన్’ స్టార్ చెప్పాడు. ‘నేను తీవ్ర దిగ్భ్రాం తికి గురయ్యా. ఆ షోలో చక్క ని ప్రదర్శన ఇచ్చా. నా ప్రదర్శనకు న్యాయమూర్తులు సైతం ఉబ్బితబ్బిబ్బయ్యారు. వారి నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అయితే డేంజర స్ జోన్‌కు రావడమే తీవ్ర నిరాశకు గురిచేసింది. 35 ఏళ్ల ఈ నటుడు తాను  డేంజరస్ జోన్‌కు చేరుకున్నానని తెలియగానే డ్యాన్స్ స్టెప్పులను సైతం మరిచిపోయాడు.

‘ నా కొరియోగ్రాఫర్‌తో కలసి ఈ వారం సెమి క్లాసికల్ డ్యాన్స్ చేశా. అసలు నేనే స్టెప్పులు మరిచిపోయానా అని నాకు అనిపిస్తోంది. ఈ షోకోసం మేము తీవ్రంగా కష్టపడ్డాం. న్యాయమూర్తులనుంచి అద్భుతమైన స్పందన వస్తుందని కూడా ఆశించాం.’ అంటూ పురబ్ బాధపడ్డాడు. ఈ షోలో పాల్గొన్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. మరోసారి అవకాశమిస్తే తన   అదృష్టాన్ని పరిశీలించుకుంటానన్నాడు.

శిక్షణ పొందిన నృత్యకారుడిని కాదని, అందువల్ల ఈ షోలనుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నాడు. కాగా ‘ఝలక్ దిఖ్‌లాజా’ షోలో ఇంకా 11 మంది సెలబ్రిటీ పోటీదారులు ఉన్నారు. వీరు తమ కొరియోగ్రాఫర్లతో కలసి ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉంది. ఈ షోకు బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.