అప్పుడు విలన్‌ రోల్ ఇవ్వలేదు.. కానీ!

17 Aug, 2019 16:35 IST|Sakshi

స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఎవరు. తొలి షో నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ మూవీపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సినిమా సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న నిర్మాత దిల్‌ రాజు ‘ఎవరు’ టీంను అభినందించారు. ఈ సందర్భంగా అడివి శేష్‌తో తమ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తామని ప్రకటించారు.

అయితే ఈ ఆఫర్‌పై హీరో అడివి శేష్‌ ఆసక్తికరంగా స్పందించారు. గతంలో దిల్ రాజు నిర్మించిన ఎవడు సినిమాలో విలన్‌ రోల్‌ కోసం అడివి శేష్‌ ప్రయత్నించాడు. అయితే వివిధ కారణాల వల్ల అప్పుడు ఆ రోల్ తనకి దక్కలేదని చెప్పాడు. ఇప్పుడు ఎవరు సినిమా సక్సెస్‌ తరువాత దిల్ రాజు స్వయంగా అడివి శేష్‌ను తన బ్యానర్‌లో సినిమా చేయమని అడగటంతో మరింత ఆనందంగా ఉన్నాడు శేష్‌.

మరిన్ని వార్తలు