వెండితెర సరోజిని

8 May, 2020 05:59 IST|Sakshi

స్వాతంత్య్ర సమరయోధురాలు, నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాగా పేరు పొందిన సరోజినీ నాయుడు బయోపిక్‌ తెరకెక్కనుంది. ఈ బయోపిక్‌కు ‘సరోజిని’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. హిందీలో ‘రామాయణ్‌’ (1987) టీవీ సీరియల్‌లో సీతగా నటించి, ఇప్పుడు బాలీవుడ్‌ చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తోన్న దీపికా చిఖలియా  టైటిల్‌ రోల్‌ చేయనున్నారు. ఆకాష్‌ నాయక్, ధీరజ్‌ మిశ్రా ద్వయం ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని రాయల్‌ ఫిల్మ్‌ మీడియా సమర్పణలో కాను భాయ్‌ పటేల్‌ నిర్మించనున్నారు. గురువారం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు దీపిక. ‘‘సరోజినీ నాయుడుగా మీ లుక్‌ బాగుంది’’ అంటూ దీపికను చాలామంది అభినందించారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యాక ఈ చిత్రం షూటింగ్‌ మొదలు కానుంది.

మరిన్ని వార్తలు