విప్లవ చిత్రాల దర్శకునిగా ఎంతో పేరు సంపాదించారు దర్శకుడు ధవళ సత్యం. శనివారం ఉదయం నర్సాçపూర్లో ఆయన తల్లి సరస్వతి (86) తుది శ్వాస విడిచారు. ఆమెకు నలుగురు కుమారులు. ముగ్గురు కుమారులు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఒక కుమారుడు నర్సాపూర్లో కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. సరస్వతి అంత్యక్రియలు శనివారం నర్సాపూర్లో నిర్వహించారు.