ఆ కథ ముందుగా బన్నీకే చెప్పా!

31 Jan, 2016 00:28 IST|Sakshi
ఆ కథ ముందుగా బన్నీకే చెప్పా!

‘‘‘ఉయ్యాల జంపాల’ చూశాక రాజ్‌తరుణ్‌ను దృష్టిలో పెట్టుకుని ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’ కథ రాసుకున్నా. అతను గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సినిమా సెట్స్‌పైకి వచ్చింది. నేను ఏ  ప్రేక్షకులను టార్గెట్ చేసి తీశానో, వారికి బాగా నచ్చుతోంది’’ అని శ్రీనివాస్ గవిరెడ్డి అన్నారు. తొలి ప్రయత్నంగా శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’ ఇటీవల  ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు...
చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. చిరంజీవిగారి నటన చూస్తూ పెరిగా. నాన్నేమో సినిమాల్లోకెళితే పనికిరాననీ, అమ్మయితే పైకొస్తా వనీ నమ్మేది. నా ఆకాంక్ష నెరవేర్చుకోడానికి హైదరాబాద్‌లో  అడుగు పెట్టా. శ్రీకాంత్ నటించిన ‘నగరం’కి సహాయ ద ర్శకునిగా చేశాను. బన్నీకి కలిసి కథ చెప్పాలన్న ప్రయత్నంతో నా జీవితం యూటర్న్ తీసుకుంది.

ప్రస్తుతం ఆది హీరోగా రూపొందిన ‘గరం’ కథ ముందు అల్లు అర్జున్‌కే వినిపించాను. ఈ సినిమా చేయకపోయినా బన్నీ నాకు ఆర్థికంగా సహకారం అందించారు. ఆయన దగ్గరే కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ చేశా. ‘గరం’కి కథ, మాటలు నావే.  భవిష్యత్తులో అల్లు అర్జున్‌తో సినిమా చేసే రోజు వస్తుందన్న నమ్మకముంది.

>