పగే ఊపిరైతే...!

28 May, 2017 01:20 IST|Sakshi
పగే ఊపిరైతే...!

ఆశ, శ్వాసే కాదు.. పగ కూడా కొందర్ని బతికేలా చేస్తుంది. అందుకు శత్రువు పై ప్రతీకారం తీర్చుకోవాలన్న సంకల్పం బలంగా ఉంటే చాలు. ఆ పగే ఊపిరై బతికిస్తుందనే కథతో  రూపొందుతోన్న రివెంజ్‌ థ్రిల్లర్‌ ‘శత్రు’. సుదర్శన్‌రెడ్డి దర్శకత్వంలో హరినాథ్‌రెడ్డి, తపస్, తమన్నా వ్యాస్, శ్రేయా వ్యాస్‌ ముఖ్య తారలుగా టి.హరినాథ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి బేబీ కుసుమ క్లాప్‌ ఇవ్వగా, శ్రీమతి స్వప్న కెమెరా స్విచ్చాన్‌ చేశారు. వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేసి, సెప్టెంబర్‌లో మూవీని రిలీజ్‌ చేయాలనుకుంటున్నట్లు దర్శకుడు సుదర్శన్‌ రెడ్డి తెలిపారు.