నేడు పోలీసుల ముందు హాజరుకానున్న వర్మ

16 Dec, 2019 10:23 IST|Sakshi
రామ్‌గోపాల్‌ వర్మ

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ వివాదస్పద సినీ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులు అందించారు. నేడు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆదేశాలు రావడంతో.. మరికాసేపట్లో సైబర్ క్రైమ్ పోలీసుల ముందు వర్మ హాజరుకానున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమా ప్రమోషన్‌లో భాగంగా వర్మ.. తన ఫోటోలు, వీడియోలు మార్పింగ్‌ చేసి సినిమాలో వాడారని కేఏ పాల్‌ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

(చదవండి : వర్మపై కేఏ పాల్‌ కోడలి ఫిర్యాదు!)

మరిన్ని వార్తలు