ఐస్‌ ల్యాండ్‌లో..

17 Sep, 2019 00:23 IST|Sakshi
రవితేజ

ఇటీవలే గోవా షెడ్యూల్‌ ముగించుకొని వచ్చిన ‘డిస్కో రాజా’ టీమ్‌ ప్రస్తుతం ఫారిన్‌ Ðð ళ్లారు. రవితేజ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డిస్కో రాజా’. పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి సమర్పణలో రజినీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 20న విడుదల కానుంది. రామ్‌ తాళ్లూరి మాట్లాడుతూ– ‘‘రవితేజ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రమిది. గోవాలో 15 రోజులపాటు షూటింగ్‌ చేసి వచ్చాం. యూరప్‌లోని ఐస్‌ల్యాండ్‌లో ప్రారంభించిన షెడ్యూల్‌కి దాదాపు 4–5 కోట్ల రూపాయలు బడ్జెట్‌ అవుతుంది.

అంత ఖర్చుతో చిత్రీకరిస్తున్న ఈ కీలక సన్నివేశం సినిమాలో కేవలం నాలుగు నిముషాలు  మాత్రమే ఉంటుంది. ఐస్‌ ల్యాండ్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో హాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 7’ చిత్రం యాక్షన్‌ స్టంట్‌ మాస్టర్స్, పలు ఇంటర్నేషనల్‌ సినిమాలకు పని చేసిన ఊలి టీమ్‌ చేస్తున్నారు.  ఈ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా ఉండబోతున్నాయి. ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కి పెద్దపీట వేస్తున్నాం. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ప్రీ లుక్‌కి మంచి స్పందన వస్తోంది. టైటిల్‌కు తగ్గట్టుగా ‘డిస్కో రాజా’ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది’’ అన్నారు. బాబీ సింహా, ‘వెన్నెల’ కిశోర్, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: సాయి రిషిక, కెమెరా: కార్తీక్‌ ఘట్టమనేని, సంగీతం: తమన్‌.

మరిన్ని వార్తలు