పాఠాలు చెబుతారట

30 Jun, 2018 01:27 IST|Sakshi
దుల్కర్‌ సల్మాన్‌

‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేశన్‌గా సావిత్రికి ప్రేమ పాఠాలు చెప్పిన దుల్కర్‌ సల్మాన్‌ ఈసారి లెక్చరర్‌గా మారి పాఠాలు చెప్పనున్నారట. మిధున్‌ మన్యూల్‌ థామస్‌ దర్శకత్వంలో దుల్కర్‌ ఓ మలయాళ సినిమాలో యాక్ట్‌ చేయనున్నారని సమాచారం. ఇందులోనే ఆయన లెక్చరర్‌గా కనిపిస్తారట. ప్రస్తుతం బాలీవుడ్‌లో సోనమ్‌ కపూర్‌తో కలసి ‘జోయా ఫ్యాక్టర్‌’ లో యాక్ట్‌ చేస్తున్న దుల్కర్‌ మలయాళంలో ‘కన్నుమ్‌ కన్నుమ్‌ కొళైయాడితల్, వాన్‌’ సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రాలకి గుమ్మడికాయ కొట్టాక మిధున్‌ సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నారు.

మరిన్ని వార్తలు