నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. ఈ చిత్రంలో పూజా సోలంకి, శశిసింగ్ కథానాయికలుగా నటించారు. వెబ్ బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్, సుధర్మ్ ప్రొడక్షన్స్ నిర్మించాయి. సుదర్శన్ హనగోడు సహ–నిర్మాత. కె. రమాకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ‘‘ఆల్రెడీ విడుదల చేసిన పాటలు, టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, హారర్ అంశాలను మేళవించి తెరకెక్కించిన చిత్రం ఇది. ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. బాబీ సింహా, వైవా రాఘవ, నాగబాబు, ‘వెన్నెల’ కిశోర్, అజయ్ ఘోష్ తదితరులు నటించిన ఈ సినిమాకు శ్రీకాంత్ పెండ్యాల సంగీతం అందించారు.