వెబ్‌లో అడుగేశారు

14 Nov, 2019 01:23 IST|Sakshi
ఈషారెబ్బా

నెట్‌ఫ్లిక్స్‌లో హిట్‌ అయిన హిందీ ఆంథాలజీ (ముగ్గురు లేదా నలుగురు దర్శకులు చిన్న చిన్న కథలను ఓ సినిమాగా రూపొందించడం) ‘లస్ట్‌ స్టోరీస్‌’. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ఇప్పుడు తెలుగులోనూ ‘లస్ట్‌ స్టోరీస్‌’ను తీసుకురాబోతోంది. ఈ ఆంథాలజీని నందినీ రెడ్డి, తరుణ్‌ భాస్కర్, సంకల్ప్‌ రెడ్డి డైరెక్ట్‌ చే స్తారు. సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహించే కథలో ఈషారెబ్బా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ పార్ట్‌ షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం అయింది. ఈషారెబ్బాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈషా డిజిటల్‌ ఎంట్రీకి ఇదే తొలి వేదిక కానుంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించే భాగంలో అమలా పాల్‌ నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు