రొమాంటిక్‌ తూటా

22 Sep, 2019 02:40 IST|Sakshi
ధనుష్

హీరో ధనుష్, దర్శకుడు గౌతమ్‌ వాసుదేవమీనన్‌ కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా ‘ఎనై నోకి పాయుమ్‌ తోట’. మేఘా ఆకాష్‌ కథానాయికగా నటించారు. ఈ సినిమాలో హీరో రానా దగ్గుబాటి అతిథి పాత్రలో నటించారు.  ఈ సినిమా తెలుగు హక్కులను విజయభేరి బ్యానర్‌పై జి. తాతరెడ్డి, జి. సత్యనారాయణ రెడ్డి సొంతం చేసుకున్నారు. ‘ఎనై నోకి పాయుమ్‌ తోట’ చిత్రాన్ని తెలుగులో ‘తూటా’ పేరుతో అనువదిస్తున్నారు. ‘‘రొమాంటిక్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా మా సినిమా ఉంటుంది’’ అని జి. తాతరెడ్డి, జి. సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ధర్భుక శివ, కెమెరా: మనోజ్‌ పరమహంస, జామన్‌ టి. జాన్, ఎస్‌ఆర్‌ కాథిర్‌.

మరిన్ని వార్తలు