ఏం జరిగింది?

11 Dec, 2014 23:11 IST|Sakshi
ఏం జరిగింది?

ముగ్గురు యువకులు తమ ప్రియురాళ్లతో ఓ ఫామ్‌హౌస్‌కి వెళతారు. అక్కడ వారికి ఎలాంటి అనుభవం ఎదురైంది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఫామ్ హౌస్’. ‘జబర్దస్త్’ శ్రీను, ‘చిత్రం’ శ్రీను, ధన్‌రాజ్, సుమన్‌శెట్టి, శ్రీచరణ్ ముఖ్య పాత్రల్లో  భవానీ అగర్వాల్ ఈ చిత్రం నిర్మించారు. యమ్.యన్. రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా భవానీ అగర్వాల్ మాట్లాడుతూ -‘‘ఇది సస్పెన్స్, హారర్ మూవీ. ఈ మధ్యకాలంలో వచ్చిన హారర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అర్జున్ స్వరపరచిన పాటలు బాగుంటాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు.