తమిళసినిమా: సీనియర్ నటుడు కార్తీక్, ఆయన కొడుకు గౌతమ్కార్తీక్ తొలిసారిగా కలిసి నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. క్రియేటీవ్ ఎంటర్టెయినర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై ధనుంజయన్ నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో మరిందరు ప్రముఖ నటీనటులు చేరుతున్నారు. ఈ క్రేజీ చిత్రంలో కథానాయకిగా నటించే అవకాశం నటి రెజీనాను వరించింది. కాగా మరో ప్రధాన పాత్రలో నటి వరలక్ష్మీశర™Œత్కుమార్ నటించనున్నారు. తిరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్ను ఖరారు చేశారు.
మిస్టర్ చంద్రమౌళి అనే టైటిల్ను నిర్ణయించినట్లు దర్శకుడు తిరు వెల్లడించారు. ఆయన వివరిస్తూ కార్తీక్, గౌతమ్కార్తీక్ కలిసి నటించనున్నారనగానే ఈ చిత్రానికి పరిశ్రమ వర్గాల్లో మంచి క్రేజ్ సంతరించుకుందన్నారు. తాజాగా రెజీనా, వరలక్ష్మీశరత్కుమార్, ముఖ్యంగా దర్శకులు మహేం ద్రన్, అగస్థియన్లు నటిస్తుండడంతో చిత్రానికి మరింత హైప్ వచ్చిందన్నారు. అంతే కాదు ఈ మిస్టర్ చంద్రమౌళి చిత్రంపై ఒక దర్శకుడిగా తన బాధ్యత పెరింగిందన్నారు.