ఫస్ట్‌ ర్యాంక్‌

26 Dec, 2017 00:25 IST|Sakshi

చేతన్‌ మద్దినేని, కాశిష్‌ వోరా జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’. నరేష్‌ కుమార్‌ హెచ్‌.ఎన్‌. దర్శకత్వంలో డాల్ఫిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్, మారుతి టాకీస్‌పై మంజునాథ్‌ కంద్కూర్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు మారుతి క్లాప్‌ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘నరేష్‌ చెప్పిన కథ చాలా బాగుంది. ఈ సినిమా అందరికి నచ్చి, యూనిట్‌కి మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

‘‘పూర్తి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. హిలేరియస్‌ కామెడీతో పాటు మెసేజ్‌ ఉంటుంది. ఈరోజు నుంచే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టాం’’ అన్నారు మంజునాథ్‌. ‘‘మారుతిగారు మాకు బ్యాక్‌బోన్‌గా ఉన్నారు. నా కథ నచ్చి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్న నిర్మాతకు కృతజ్ఞతలు’’ అన్నారు నరేష్‌ కుమార్‌. తనికెళ్ల భరణి, నరేష్, ‘వెన్నెల’ కిషోర్, ప్రియదర్శి, రమ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రామ్‌కుమార్‌ మద్దినేని, సంగీతం: కిరణ్‌ రవీంద్రనాథ్, కెమెరా: శేఖర్‌ చంద్ర.

మరిన్ని వార్తలు