నలుగురు దర్శకులు.. నెట్‌ఫ్లిక్స్‌ కథలు

29 Aug, 2019 00:21 IST|Sakshi
గౌతమ్‌ మీనన్, వెట్రిమారన్, సుధ, విఘ్నేష్‌

బాలీవుడ్‌ అగ్ర దర్శకులు జోయా అక్తర్, కరణ్‌ జోహార్, దిబాకర్‌ బెనర్జీ, అనురాగ్‌ కశ్యప్‌లతో ‘లస్ట్‌ స్టోరీస్‌’ అనే యాంథాలజీ (ఇద్దరు ముగ్గురు దర్శకులు కలసి ఒక్కో భాగానికి దర్శకత్వం వహించడం) రూపొందించింది నెట్‌ఫ్లిక్‌. తెలుగులోనూ ‘లస్ట్‌ స్టోరీస్‌’ను తీసుకు రాబోతోంది. సందీప్‌రెడ్డి వంగా, సంకల్ప్‌ రెడ్డి ఒక్కో భాగాన్ని డైరెక్ట్‌ చేయనున్నారు. ఇప్పుడు తమిళంలోనూ నెట్‌ఫ్లిక్‌ ఓ యాంథాలజీ ప్లాన్‌ చేసిందని సమాచారం. దర్శకులు గౌతమ్‌ మీనన్, సుధా కొంగర, వెట్రిమారన్, విఘ్నేష్‌ శివన్‌లు ఈ యాంథాలజీను డైరెక్ట్‌ చేయనున్నారట. ఇది తమిళ వెర్షన్‌ ‘లస్ట్‌ స్టోరీస్‌’ అని ప్రచారం జరుగుతోంది. ఈ  విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు