భారత జాతిపిత మహాత్మాగాంధీ జీవిత కథాంశంతో తెలుగులో ‘గాంధీ’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. కృష్ణవంశీ ‘మహాత్మ’ సినిమాలో గాంధీగా కనిపించిన నటుడు రాంజగన్ ఇందులో ‘గాంధీ’గా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఉదయ్భాస్కర్.పి దర్శ కుడు. లక్ష్మీ ప్రియాంక పువ్వాడ సమర్పణలో సోనికా క్రియేషన్స్ పతాకంపై కేవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ప్రచార చిత్రాలను గురువారం హైదరాబాద్లో రాష్ట్రమంత్రులు టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్రెడ్డి, కాసు వెంకట కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు బొగ్గారపు సీతారామిరెడ్డి, హసీనాలను సత్కరించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ‘గాంధీ’ చిత్ర నిర్మాణం సమాజానికి అవసరమని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇంకా వెంకటేశ్వరరెడ్డి, గోపీనాథరెడ్డి, దొరస్వామిరాజు, సాగర్, తనికెళ్ల భరణి, కృష్ణుడు, నాగబాల సురేష్, నాగేంద్రకుమార్, రత్నమయ్య, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు మాట్లాడారు.