ఆకాష్ పోరాడబోయేది ఇతనితోనే..!

14 Oct, 2017 11:56 IST|Sakshi

డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కు వరుసగా ఫ్లాప్ లు వస్తున్నా స్పీడు మాత్రం తగ్గించటం లేదు. ప్రస్తుతం ఆయన తన తనయుడ్ని రీలాంచ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఓ పీరియాడిక్ లవ్ స్టోరితో ఆకాష్ ను హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. మెహబూబా పేరుతో 1971 నాటి భారత్, పాకిస్థాన్ ల యుద్ధ నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గానటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు విలన్ కు ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. తమిళ సూపర్ హిట్ తుపాకీ సినిమాలో కీలక పాత్రలో నటించిన గౌతమ్ కురుప్ మెహబూబాలో విలన్ గా నటించనున్నాడట. గౌతమ్.. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన డిక్టేటర్ లోనూ నటించాడు.

మరిన్ని వార్తలు