‘గీత గోవిందం’ దర్శకుడి నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌!

29 Aug, 2018 12:22 IST|Sakshi

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా గీత గోవిందం. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వందకోట్లకు పైగా గ్రాస్‌ సాధించి సత్తా చాటింది. ఓవర్‌ సీస్‌లో రెండు మిలియన్లు వసూళ్లు సాధించిన ఈ సినిమా.. దర్శకుడు పరశురామ్‌కు స్టార్‌ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. గీత గోవిందం భారీ సక్సెస్ సాధించటంతో పరుశురామ్‌ తెరకెక్కించబోయే తదుపరి సినిమాపై ఆసక్తి నెలకొంది.

తాజాగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు పరుశురామ్‌. గీత గోవిందం చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లోనే తన తదుపరి చిత్రం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే నిర్మాత బన్నీవాసుకు నాలుగైదు లైన్‌లు వినిపించినట్టుగా చెప్పిన పరుశురామ్‌ దేవుడికి మనిషి మధ్య జరిగే ఓ కథను బన్నీవాసు ఫైనల్ చేసినట్టుగా తెలిపారు. పూర్తి స్క్రిప్ట్‌ రెడీ అయిన తరువాత అల్లు అరవింద్‌కు వినిపిస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు