సంగీతంలో సస్పెన్స్‌

25 Oct, 2019 00:27 IST|Sakshi
జోయా, సందీప్, సాన్య

సందీప్, శివ, విశ్వాస్, ఠాగూర్, సాన్య, జోయా ముఖ్య తారలుగా గంటాడి కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. గడ్డం రవి సమర్పణలో గంటాడి కృష్ణ, సురేష్‌ రెడ్డి నిర్మిస్తున్న  ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి టీఆర్‌ఎస్‌ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి  కెమెరా స్విచ్చాన్‌ చేయగా, ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి క్లాప్‌ ఇచ్చారు.

గంటాడి కృష్ణ మాట్లాడుతూ– ‘‘మంచి కథ, కథనాలతో సంగీత ప్రధానంగా సాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది’’ అన్నారు. ‘‘ఓ కొత్త కథతో కృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు సురేష్‌ రెడ్డి. ‘‘కచ్చితంగా హిట్‌ కొడతామనే నమ్మకం ఉంది’’ అన్నారు సందీప్, విశ్వాస్‌. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్‌ బామ్మిశెట్టి, సహ నిర్మాతలు రాధాకృష్ణ, మహేష్‌ కల్లె, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: రాహుల్, పరిటాల.

మరిన్ని వార్తలు