ప్రభాస్తో మొబైల్ కంపెనీ భారీ డీల్

6 Jun, 2017 12:38 IST|Sakshi
ప్రభాస్తో మొబైల్ కంపెనీ భారీ డీల్

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ను తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా ఒప్పించాలని చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. గతంలో మహీంద్ర యాడ్ లో కనిపించిన ప్రభాస్ తరువాత ఒక్క బ్రాండింగ్ కూడా అంగీకరించలేదు. పదిహేను కోట్లకు పైగా ఇస్తామన్న కంపెనీలకు కూడా నో చెప్పాడు ఈ బాహుబలి. దీంతో బాహుబలి తరువాత ప్రభాస్ ఒప్పకోబోయే తొలి బ్రాండ్ ఏంటా అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా డార్లింగ్ ఓ మొబైల్ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించాడానికి అంగీకరించాడు. చైనా మొబైల్ దిగ్గజం జియోనీకి ప్రస్తుతం బాలీవుడ్ క్యూట్ హీరోయిన్ అలియ భట్ అంబాసిడర్గా ఉంది. అయితే తాజాగా ఈ సంస్థ తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరించేందుకు ప్రభాస్తో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే ప్రభాస్తో ఓ యాడ్ను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ యాడ్ తరువాతే సాహో సినిమా షూటింగ్కు హాజరు కానున్నాడు ప్రభాస్.