‘గీతోపదేశం’ ఎవరికోసం?

1 Nov, 2013 00:21 IST|Sakshi
‘గీతోపదేశం’ ఎవరికోసం?
యజత్, ఉషా జంటగా రూపొందుతోన్న చిత్రం ‘గీతోపదేశం’. జిన్నా దర్శకత్వంలో జె.మధుబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి నిర్మాత తండ్రి నాగేంద్రం కెమెరా స్విచాన్ చేయగా, టి.ప్రసన్నకుమార్ క్లాప్ ఇచ్చారు. వీఎన్ ఆదిత్య గౌరవ దర్శకత్వం వహించారు. పురాణాలను గుర్తు చేసే కథాంశమిదని, నాలుగున్నరేళ్లు కష్టపడి ఈ కథ తయారు చేశామని దర్శకుడు చెప్పారు. 40 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి, జనవరి 3న పాటలను, అదే నెలాఖరులో సినిమాను విడుదల చేస్తామని, ఇందులో విలన్‌గా నటిస్తున్నానని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రాహుల్-వెంగీ, కెమెరా: రాహుల్ మాచినేని, ఎడిటింగ్: డి.రాజా.