వేసవి బరిలో.. .

1 Jan, 2020 01:36 IST|Sakshi

‘గౌతమ్‌నంద’ చిత్రం తర్వాత గోపీచంద్‌– సంపత్‌ నంది కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమన్నా, దిగంగనా సూర్యవంశీ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ‘‘హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది. తొలి షెడ్యూల్‌లో భాగంగా అజీజ్‌ నగర్‌లో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. త్వరలో మరో షెడ్యూల్‌ ప్రారంభిస్తాం. వేసవికి సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. భూమిక, రావురమేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌ రాజన్, సంగీతం: మణిశర్మ, సమర్పణ: పవన్‌కుమార్‌.   

మరిన్ని వార్తలు