గోపీచంద్‌ ‘పంతం’ టీజర్‌

5 Jun, 2018 11:21 IST|Sakshi

గోపీచంద్‌ హీరోగా కె.చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా పంతం. ‘ఫర్‌ ఏ కాస్‌’ అనే ట్యాగ్‌ లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీసత్య సాయి బ్యానర్‌పై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా టీజర్‌ రిలీజ్‌ అయ్యింది. గోపీచంద్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ యాక్షన్‌ కథతో పంతం సినిమాను తెరకెక్కించారు. గోపీచంద్‌ 25వ సినిమాగా రూపొందుతున్న  ఈ మూవీలో మెహరీన్‌ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 5న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు