మోడ్రన్‌ గుండమ్మ 

3 Jun, 2020 00:07 IST|Sakshi

ఆదిత్య, ప్రణవ్య జంటగా కృష్ణంరాజు– లక్ష్మీ శ్రీవాత్సవ దర్శక ద్వయం తెరకెక్కించిన చిత్రం ‘గుండమ్మకథ’ (2020). ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘అలనాటి ‘గుండమ్మకథ’ చిత్రం తరతరాలుగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఆ స్ఫూర్తితో ఈ మోడ్రన్‌ గుండమ్మకథను రెడీ చేశాం. లవ్, కామెడీ, సెంటిమెంట్‌ ఇలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే సినిమా విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు.ఈ సినిమాకు ఒక నిర్మాతగా ఉన్న లక్ష్మీ శ్రీవాత్సవ స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ కూడా అందించారు. ‘గెటప్‌’ శ్రీను, భాష తదితరులు నటించిన ఈ సినిమాకు మోనీష్‌ భూపతి సంగీతం అందించారు.  

మరిన్ని వార్తలు