గుంటూరు కహానీ!

9 Jun, 2015 00:38 IST|Sakshi
గుంటూరు కహానీ!

 అది ఓ మెడికల్ షాపు. దాంట్లో పనిచేసే ఇద్దరు యువకులు అతితెలివితేటలతో చేసిన పని, వారి జీవితాలను మలుపు తిప్పుతుంది. మరి ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ‘గుంటూరు టాకీస్’ చూడాల్సిందే. ‘చందమామ కథలు’ చిత్రంలో జాతీయ పురస్కారం అందుకున్న ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకుడు. సిద్ధు జొన్నలగడ్డ, సీనియర్ నరేశ్, లక్ష్మీ మంచు, మహేశ్ మంజ్రేకర్, శ్రద్ధాదాస్, రష్మి గౌతమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై రాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టాకీపార్ట్ చిత్రీకరణ పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ - గుంటూరు నేపథ్యంలో సాగే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆద్యంతం చాలా ఉత్కంఠతతో ఈ సినిమా సాగుతుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, సంగీతం: శ్రీ చరణ్.