ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆనందంలో మునిగి తేలుతోంది. బిల్ క్లింటన్ లాంటి నాయకులతో వేదికను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని తెగ మురిసిపోతోంది. ప్రస్తుతం ఆమె ఒక అమెరికాలో ఒక టీవీ షో షూటింగ్ లో ఉంది. బాలికల విద్య - మహిళల సాధికారిత అనే అంశంపై బోస్టన్ లో జరిగిన ప్రపంచ నాయకుల సదస్సులో ప్రియాంక పాల్గొంది. బ్రిటీష్ ప్రధాని గోర్డన్ బ్రౌన్ , యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నిక్ తదిరుతలు పాల్గొన్న ఈ సదస్సులో నల్లగౌనులో మెరిసిపోయింది ప్రియాంక.
మహిళల అభివృద్ధిలో బాలికల విద్య చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపింది. అంతేకాదు మహిళా సాధికారత దేశ అభివృద్ధికి దోహదపడుతుందంటూ తన ప్రసంగంలో పేర్కొంది ఈ బ్లాక్ బ్యూటీ. తనకిష్టమైన సబ్జెక్టుపై మాట్లాడటం చాలా సంతోషంగానూ, గౌరవంగానూ ఉందంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా మహిళలందరికీ వాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. మీరందరూ చాలా విలువైన వారు..మర్చిపోకండి.. అంటూ ట్వీట్ చేసింది.