ఫస్ట్ హాఫ్ ఆయనకు నచ్చేసింది!

25 Jun, 2015 12:01 IST|Sakshi
ఫస్ట్ హాఫ్ ఆయనకు నచ్చేసింది!

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారని అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అయితే గత రెండు, మూడు రోజులుగా ఈ చిత్రానికి వేరే దర్శకుణ్ణి తీసుకున్నారని ఫిలింనగర్‌లో ఓ చర్చ జరుగుతోంది. ఈ చర్చకు ఒక్క ట్వీట్‌తో పుల్‌స్టాప్ పెట్టేశారు పూరి జగన్నాథ్. ‘‘చిరంజీవిగారికి ఈ చిత్రానికి సంబంధించిన కథ తాలూకు ఫస్ట్ హాఫ్ చెప్పాను.

ఆయనకు  బాగా నచ్చేసింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ కోసం వర్క్ చేయాలి. ఇది పది రెట్లు బాగుండేలా తయారు చేస్తా’’ అని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు పూరి.