హృదయంలో నువ్వే ఉంటావు!

25 Feb, 2019 00:22 IST|Sakshi

ఏడాది క్రితం అతిలోక సుందరి శ్రీదేవి తిరిగిరాని  లోకానికి వెళ్లిపోయారు. శ్రీదేవి చనిపోయి ఏడాది కావస్తోంది, అభిమానులు, సినీ ప్రముఖులు మరోసారి శ్రీదేవి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ కూడా తల్లిని తలుచుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్‌ చేశారు. ‘‘నా హృదయం ఎప్పుడూ బరువుగానే ఉంటుంది. కానీ నేనెప్పుడూ నవ్వుతూనే ఉంటాను. ఎందుకంటే నా హృదయంలో ఉండేది నువ్వు (తల్లి శ్రీదేవి) కాబట్టి’’ అని క్యాప్షన్‌ చేశారు.  

మరిన్ని వార్తలు