వెబ్‌ సిరీస్‌లో హెబ్బా

21 Dec, 2019 02:28 IST|Sakshi
హెబ్బా పటేల్‌

డిజిటల్‌ మీడియమ్‌లో షోలు, సిరీస్‌లకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయడానికి స్టార్స్‌ కూడా వెబ్‌ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా హెబ్బా పటేల్‌ కూడా ఓ వెబ్‌ సిరీస్‌లో కనిపించనున్నారు. నవదీప్, హెబ్బా పటేల్‌ ముఖ్య పాత్రల్లో దర్శకుడు అజయ్‌ భూయాన్‌ ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ ఇటీవల ప్రారంభం అయింది. ఈ వెబ్‌ సిరీస్‌ జానర్, మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నితిన్‌ ‘భీష్మ’, రాజ్‌ తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు హెబ్బా పటేల్‌.

మరిన్ని వార్తలు