తనీష్, అనీషా జంటగా ప్రేమకథా చిత్రం

28 Jan, 2014 17:20 IST|Sakshi
తనీష్, అనీషా జంటగా ప్రేమకథా చిత్రం

తనీష్, అనీషా జంటగా ఓ ప్రేమకథా చిత్రం రూపొందుతోంది. పంచగిరి క్రియేషన్స్ పతాకంపై కుమార్ బ్రదర్స్ సమర్పణలో శ్రీనివాస్ ఏలిజాల,డి.సురేష్ నిర్మించనున్న ఈ చిత్రానికి భాస్కర్ దర్శకుడు. ఈ నెల 30న తిరుపతిలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన శ్రీనివాప్ ఏలిజాల చిత్ర విశేషాలను తెలియజేశారు.ఇటీవల పాటల రికార్డింగ్ ను ప్రారంభించామని, తనీష్ కు ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం అవుతుందన్నారు. క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కుటుంబ ప్రేక్షకులను అలరించే అంశాలను కూడా ఉన్నాయన్నారు.

 

నేటి తరం ప్రతినిధిగా తనీష్ కనిపిస్తాడని, మలేషియాలో చిత్రీకరించబోయే పాటలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ ఉంటాయన్నారు. సుమన్ శెట్టి, దండపాణి, సీత తదితరులు ముఖ్యపాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి సంగీతం:సాదక్ హాసన్.

>