ఇంటి ప‌నిలో స‌హాయం చేద్దాం: వెంక‌టేష్‌

23 Apr, 2020 14:04 IST|Sakshi

టాలీవుడ్‌లో సందీప్‌రెడ్డి వంగా ప్రారంభించిన ‘బి ది రియ‌ల్ మ్యాన్‌’ ఛాలెంజ్‌..సోష‌ల్ మీడియాలో  ట్రెండింగ్‌లో ఉంది. త‌మ పేవ‌రెట్ స్టార్స్ ఇలా గ‌రిటె ప‌డుతూ స్వ‌యంగా ఇంటిప‌నులు చేస్తున్న వీడియోలు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. వేసవి సినిమా వినోదం లేకున్నా ఈ ఎంట‌ర్‌టైన్‌మెంట్ చాలు అనుకుంటున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ విసిరిన ఛాలెంజ్‌ను హీరో వెంక‌టేశ్ పూర్తిచేశారు. ఇళ్లు తుడిచి తోట పనిచేసి వంట చేసి పెట్టారు. ఆ వీడియోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ..ఇంటి ప‌నిలో కుటుంబానికి స‌హాయం చేద్దాం అంటూ ట్వీట్ చేశారు. అనంతరం ఈ ఛాలెంజ్‌కు ‘చిన్నోడు’ మహేష్ బాబు, ‘కోబ్రా’ వరుణ్ తేజ్‌, డైరెక్టర్ అనిల్ రావిపూడిల‌ను నామినేట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు